బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదు: పవన్ కల్యాణ్

బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదు: పవన్ కల్యాణ్

అనంతపురం: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో జనసేన పార్టీ పోటీ చేయబోవడం లేదని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జిల్లాలోని పుట్టపర్తి సమీపంలోని కొత్తచెరువులో శ్రమదాన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. సాంప్రదాయాలకు విలువ ఇస్తానని స్పష్టం చేసిన ఆయన అకాల మరణం చెందిన ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి పోటీలో ఉంది కాబట్టి మేమే పోటీ చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు. 
ముందుగా తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. తాను ఏమీ ఇవ్వకపోయినా దేశం కోసం... దేశ అభివృద్ధి కోరుతూ తన వెంట వస్తున్న కార్యకర్తలకు అభినందిస్తూ.. వారిని ఇక్కడకు పంపిన తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎంతో కష్టపడి తన పర్యటనకు బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు, కానిస్టేబుళ్లను చూస్తుంటే.. తన తండ్రి గుర్తుకొస్తున్నాడని చెప్పారు. తాను కూడా ఓ పోలీసు కానిస్టేబుల్ కొడుకునని.. గుర్తు చేస్తూ.. తన కార్యక్రమానికి వచ్చిన కానిస్టేబుళ్లు, ఎస్.ఐలు, సీఐలు, డీఎస్పీలు, ఎస్పీలు అందరికీ కృతజ్ఘతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన ప్రభుత్వం ఏర్పాటు తధ్యమని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.